టీఎంసీ పార్టీ వర్గాల వారు మరియు ప్రభుత్వ వర్గాల వారు ఈ దాడిని ఖండించారు. పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జాకీర్ హుస్సేన్ కాలుకు తీవ్ర గాయం అయ్యిందని ఆయన కాలుకు ఆపరేషన్ అవసరం అవుతుందని అంటున్నారు. బాంబు దాడిలో మంత్రితో పాటు ఆయన అనచరులు కూడా తీవ్ర గాయాల పాలయినట్లుగా సమాచారం అందుతోంది. ఈ బాంబు దాడిలో ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. బాంబు దాడికి సంబంధించిన విచారణ వేగంగా జరుపుతున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు.