Advertisement

క‌రోనానా మ‌జాకా…అతిలోక సుంద‌రి కుటుంబం గ‌జ‌గ‌జ

Posted : June 12, 2020 at 12:18 pm IST by ManaTeluguMovies

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కుటుంబానికి క‌రోనా మ‌హ‌మ్మారి క్ష‌ణ‌క్ష‌ణం సినిమా చూపించింది. ఈ విష‌యాన్ని శ్రీ‌దేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాహ్న‌వి స్వ‌యంగా చెప్పారు. త‌మ కుటుంబాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణికించింద‌ని ఆమె ఆవేద‌న‌తో చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ అయిన మొద‌టి చిత్రంతోనే జాహ్న‌వి స‌క్సెస్ అయ్యారు. ఆ త‌ర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేక‌పోయింది.

ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఆమె కుటుంబ స‌భ్యుల‌తో ఇంటి వ‌ద్ద స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. ఓ ఇంగ్లీష్ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఆమె వెల్ల‌డించారు. క‌రోనా పేరు త‌ల‌చుకుంటూ ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. లాక్‌డౌన్‌లో కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతున్న స‌మ‌యంలో పిడుగులాంటి వార్త నిలువెల్లా వ‌ణికిపోయేలా చేసింద‌న్నారు.

తమ ఇంట్లో పని చేస్తున్న వారిలో ఒక‌రికి కరోనా సోకినట్లు తెలియ‌డంతో ఆందోళ‌న‌కు గుర‌య్యామ‌న్నారు. దీంతో కుటుంబ సభ్యులంతా కరోనా టెస్టులు చేయించుకోక త‌ప్ప‌లేద‌న్నారు. త‌మ‌తో పాటు ప‌ని మ‌నుషులకు కూడా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసిన‌ట్టు జాహ్న‌వి వెల్ల‌డించారు. ఈ టెస్టుల్లో ఇంట్లో ప‌నిచేసే ఇద్ద‌రికి పాజిటివ్ అని తేలింద‌న్నారు.

క‌రోనా సోకిన వారి గురించి మీడియా ద్వారా ర‌క‌ర‌కాలుగా వింటుండంతో…తామంతా భయంతో ఒణికిపోయినట్టు జాహ్న‌వి చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి ముగ్గురు పని మనుషులు కోలుకుని సుర‌క్షితంగా బయటపడ్డార‌ని ఆమె తెలిపారు. కాగా తన తండ్రి, చెల్లెలి బాధ్యతలను తానే తీసుకున్నట్టు జాహ్న‌వి తెలిపారు. వారి అవసరాలను తానే నెరవేర్చుతునట్లు చెప్పారు. ఇది తనకు చాలా సంతృప్తిగా ఉందని జాహ్నవి పేర్కొన్నారు.


Advertisement

Recent Random Post:

రాజమండ్రి బరిలో పురందేశ్వరి ? | Daggubati Purandeswari Contesting From Rajahmundry MP Seat?

Posted : March 24, 2024 at 6:57 pm IST by ManaTeluguMovies

రాజమండ్రి బరిలో పురందేశ్వరి ? | Daggubati Purandeswari Contesting From Rajahmundry MP Seat?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement