ప్రస్తుతం గెలిచిన టీడీపీ అభ్యర్ధులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్ నిర్వహిస్తున్నారు. చైర్మన్ ఎన్నిక రోజున వీరితో కలిసి తాడిపత్రికి వెళ్లలనే యోచనలో ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. దీంతో తాడిపత్రి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద రాయలసీమలో మాత్రమే టీడీపీ గెలుచుకున్న రెండు స్థానాలు ఉన్నాయి. ఒకటి తాడిపత్రి కాగా.. రెండో పట్టణం కడప జిల్లాలోని మైదకూరు.