ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాకింగ్ నిర్ణయం

అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ ఎంత వరకు వెళ్లడానికైనా వెనుకాడరు. నచ్చిన హీరో కోసం ఏది చేసినా అందులో కిక్కుంటుందని భావిస్తుంటారు. అందుకే ఖర్చుకి వెనకాడకుండా తాము నచ్చిన మెచ్చిన హీరో కోసం ఎలాంటి సాహసానికైనా వెనుకాడరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలాంటి పనే చేసి వార్తల్లో నిలిచారు. తారక్ కు వరల్డ్ వైడ్ గా హ్యూజ్ ఫ్యాన్ బేస్ వుంది. అయితే అది ఇప్పడు భారీ స్థాయిలో బయటపడుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` లో నటించారు. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా?

అని వరల్డ్ వైడ్ గా వున్న సినీ ప్రియులు అభిమానులు గత కొంత కాలంగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ మేకర్స్ `ఆర్ ఆర్ ఆర్`ని మార్చి 25న అత్యంత భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా చర్చనీయాంశంగా మారుతోంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ప్రీమియర్ కు సంబంధించిన 75 టికెట్ లని టెక్సాస్ కి చెందిన ఓ అభిమాని ఖరీదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా వుంటే తాజాగా మంగళవారం అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ థియేటర్ ఈవినింగ్ షో మొత్తాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు పలువురిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విధంగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై తమకున్న ప్రేమని మరో సారి రుజువు చేశారని అంతా అంటున్నారు.

మునుపెన్నడూ లేనంతగా ఎన్టీఆర్ పై అభిమానులు చూపిస్తున్న ప్రేమ ఇప్పుడు సర్వత్రా సరికొత్త చర్చకు తెర లేపడం విశేషం. ఇక `ఆర్ ఆర్ ఆర్` విషయానికి వస్తే ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ ఫిక్షనల్ స్టోరీని తెరపై రాజమౌళి అవిష్కరించిన చిత్రమిది. దీంతో ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ భాషలకు చెందిన నటులు కీలక పాత్రల్లో నటించడం `బాహుబలి` వంటి చిత్రం తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ సినీ లవర్స్ అ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంత మందైతే బెట్టింగులు పెడుతున్నారు.

ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుందన్నది తెలియాలంటే మార్చి 25 వరకు వేచి చూడాల్సిందే. అల్లూరి సీతారామరాజు పాత్రల రామ్ చరణ్ కమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించారు. అలియాభట్ సీతగా కనిపించబోతోంది. హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్ .. ఎన్టీఆర్ కు జోడీగా కనిపించనున్న ఈ మూవీలో ప్రధాన విలన్ గా హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్ కనిపించబోతున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సినిమా ఫలితం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version