ఆ దేశాల్లో విపరీతమైన కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కారణాల వల్ల ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా దుబాయ్ మరియు మాల్దీవులకు క్యూ కడుతున్నారు. స్టార్స్ కపుల్స్ గా అయితే దుబాయికి వెళ్తున్నారు. సింగిల్స్ అయితే మాల్దీవులకు వెళ్తున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన హనీమూన్ ను మాల్దీవుల్లో జరుపుకున్న విషయం తెల్సిందే. ఇంకా పలువురు ముద్దుగుమ్మలు కూడా మాల్దీవులకు వెళ్లిన విషయం తెల్సిందే.
మహేష్ బాబు ఇటీవలే దుబాయ్ కి కుటుంబం మొత్తంతో కలిసి వెళ్లాడు. అక్కడ హాలీడేస్ ను ఎంజాయ్ చేసి వచ్చారు. ఇంకా ఎన్టీఆర్ మరియు కుటుంబ కూడా దుబాయ్ కి వెళ్లి వచ్చారు. రామ్ చరణ్ మరియు ఉపాసన కూడా దుబాయ్ ప్లాన్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో నితిన్ మరియు అతడి భార్య కూడా దుబాయి ట్రిప్ కు వెళ్లారు. ఇలా పలువురు స్టార్స్ దుబాయి మాల్దీవులు అంటూ చాలా కాలం తర్వాత ప్రయాణాలు పెట్టుకుఇ హాలీడేస్ ను ఎంజాయ్ చేసేందుకు అక్కడకు వెళ్లారు… వచ్చారు.. వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారు.