గుజరాత్ లోనే ఇంకా షూటింగ్ జరపాల్సి ఉంది. అయితే.. ఈ ప్రమాదం నేపథ్యంలో షూటింగ్ నిలిపేశారని వార్తలు వస్తున్నాయి. నిఖిల్ స్పల్ప గాయాలు అయ్యాయని.. అభిమానులు ఆందోళన చెందొద్దని యూనిట్ వర్గాలు అంటున్నాయి. నిఖిల్, చందూ మొండేటి కలయికలో వచ్చిన కార్తికేయ విజయం సాధించింది. సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.