వాలిమై సినిమా పూర్తి అయిన వెంటనే కార్తికేయ తో వరుసగా రెండు సినిమాలను తెలుగులో నిర్మించి పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేయాలని భావిస్తున్నాడట. అందుకు సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయి. కార్తికేయను బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మొత్తానికి బోణీ కపూర్ దృష్టిలో పడి వరుసగా ఆయన బ్యానర్ లో సినిమాలు చేసే అవకాశం దక్కించుకోవడంతో పాటు బాలీవుడ్ వెళ్లేందుకు కూడా సిద్దం అవుతున్నాడు.