ఈ సినిమాతో ఆమె కెరీర్ గ్రాఫ్ మొత్తంగా మారిపోయింది. వరసపెట్టి కీర్తి సురేష్ కు అవకాశాల వెల్లువ అందుతోంది. ప్రస్తుతం దక్షిణాదిన అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ మొదట ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం తెలుగులో మూడు, తమిళంలో రెండు, మలయాళంలో ఒక సినిమాతో కీర్తి సురేష్ డైరీ ఫుల్ బిజీగా ఉంది.
తెలుగులో నితిన్ సరసన రంగ్ దే సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్. ఈ సినిమా మరో నెల రోజులు చిత్రీకరిస్తే షూటింగ్ పూర్తవుతుంది. మిస్ ఇండియా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. గుడ్ లక్ సఖి అనే సినిమాలో కూడా నటిస్తోంది కీర్తి సురేష్. ఈ సినిమాలే కాకుండా నితిన్ తన తర్వాతి చిత్రమైన పవర్ పేట చిత్రంలో కీర్తి సురేష్ నే కథానాయికగా ఎంచుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు.
అలాగే మహేష్ బాబు – పరశురామ్ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా కన్ఫర్మ్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ఇలా వరసగా క్రేజీ ఆఫర్లతో కీర్తి సురేష్ హవా నడుస్తోంది.