ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. ఆ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాలున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కృతి శెట్టి నటించబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించేందుకు నిర్మాతలు సిద్దం అవుతున్నారు. ఈ ఏడాది ఉప్పెనతో మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలతో కూడా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.