తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా సుజీత్ స్క్రిప్ట్ లో మార్పులు పూర్తి చేసాడు. స్క్రిప్ట్ రెడీగా ఉంది. చిరంజీవి ఎప్పుడు సై అంటే అప్పటినుండి షూటింగ్ ను మొదలుపెట్టడానికి సుజీత్ కూడా సిద్ధమవుతున్నాడు. లూసిఫెర్ లో హీరో పాత్ర తర్వాత సిస్టర్ పాత్ర చాలా కీలకమైంది. మలయాళంలో ఆ పాత్రను మంజు వారియర్ పోషించింది.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ పాత్ర కోసం సీనియర్ నటి సుహాసిని పోషించబోతున్నట్లు వినికిడి. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా మార్పులు చేసిన సుజీత్ చిరంజీవి ఇమేజ్ ను కూడా దృష్టిలో ఉంచుకుని మరిన్ని కమర్షియల్ అంశాలను కూడా దట్టించినట్లు తెలుస్తోంది.