కానీ ఈ ఇద్దరి మధ్యా రీసెంట్ గా కొంత గ్యాప్ వచ్చినట్లు అనిపించింది. ఈ ఇద్దరి కాంబోలో ప్రకటించిన జనగణమన ప్రకటనలకే పరిమితమైంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ కంటే ఆయన అభిమానులంటేనే నాకు ఇష్టం. మహేష్ హిట్స్ ఉన్నప్పుడే పట్టించుకుంటాడు. మళ్ళీ తనతో సినిమా చేయడం కష్టమే, నాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది కదా అన్నట్లుగా కొన్ని వ్యాఖ్యలు చేసాడు. దీనిపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది.
కానీ రీసెంట్ గా ఇద్దరి మధ్య విబేధాలు సమసిపోయాయా అనిపిస్తోంది. ఎందుకంటే మహేష్ ఇటీవలే నిర్వహించిన ఇన్స్టా లైవ్ లో పూరితో సినిమా ఉంటుందా అని అడిగితే తప్పకుండా ఉంటుంది, తను నా ఫేవరేట్ డైరెక్టర్. ఇప్పటికీ పూరి స్క్రిప్ట్ వినిపిస్తాడని ఎదురుచూస్తున్నానని తెలిపాడు. పూరి జగన్నాథ్ కూడా సర్కారు వారి పాట సినిమా ప్రకటన సందర్భంగా మహేష్ ను ట్యాగ్ చేసి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు.
ఇవన్నీ చూస్తుంటే ఇద్దరూ మళ్ళీ కలిసిపోయారా, త్వరలోనే కలిసి సినిమా చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.