ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే పరశురామ్ తో సినిమాను పక్కా చేసుకోవచ్చు. అయితే మే 31కి లాంచ్ అంటున్నారు. అది ఉంటుందా ఉండదా అన్నది ఇంకా తెలియలేదు. ఇక ఈ మధ్యనే రాజమౌళి తన తర్వాతి సినిమా మహేష్ తోనే అని తేల్చి చెప్పిన సంగతి తెల్సిందే. ఆ చిత్రం 2022 లో మొదలవుతుంది. రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా రెండేళ్లు తెరకు దూరం కావాల్సిందే.
2022లో సినిమా అంటే పరశురామ్ తో సినిమా తర్వాత మరొకటి మహేష్ చేసే అవకాశముంది. అది ఏ సినిమా అన్నదానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. పరశురామ్ తో సినిమా అవ్వగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే అనిల్ రావిపూడితో కూడా సినిమా ఉండే అవకాశముంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మహేష్ కచ్చితంగా చేస్తాడని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.