ఫైనల్ గా డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమా గురించి నోరు తెరిచి మాట్లాడారు. ‘నా నెక్స్ట్ సినిమా మహేష్ బాబు గారితోనే ఉంటుంది. స్క్రిప్ట్ అంతా పక్కాగా రెడీ అవుతోంది. చాలా మంచి స్క్రిప్ట్ ఇది అందుకే వదలకుండా ఈ క్వారంటైన్ లో బెటర్ చేస్తున్నాను. ఒక్కడు సినిమా చూసే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచీ ఉన్న కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. మహేష్ బాబు అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటూనే, ఎమోషన్స్ కి కూడా చోటుంటుంది. చెప్పాలంటే నవరసాలు ఈ సినిమాలో ఉంటాయని’ పరశురామ్ తెలిపాడు.
సో ఇక అభిమానులు మహేష్ తదుపరి సినిమాపై దిగులుపడాల్సిన అవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతగా ఈ సినిమా ఉండనుంది.