ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మహేష్‌, తమన్నాలను డైరెక్ట్ చేస్తున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్‌

మహేష్ బాబు.. తమన్నాల జోడీ ని మరో సారి ప్రేక్షకులు చూడబోతున్నారు. అయితే ఈసారి వెండి తెరపై కాకుండా బుల్లి తెరపై వీరిద్దరి కాంబోను ప్రేక్షకులు చూడబోతున్నారు. ప్రస్తుతం అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ వంగ దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. ముంబయిలో ప్రముఖ స్టూడియోలో ఈ షూటింగ్ జరుపుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇంతకు వీరిద్దరు కలిసి నటిస్తున్నది దేనికో తెలుసా ఒక కమర్షియల్‌ యాడ్‌ కోసం. సందీప్ వంగ దర్శకత్వం వహిస్తున్న ఆ కమర్షియల్‌ యాడ్‌ లో మహేష్‌ మరియు తమన్నాలు కలిసి నటిస్తున్నారు.

ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ గ్యాప్ లో మహేష్‌ బాబు ఈ కమర్షియల్‌ యాడ్‌ ను చేస్తున్నాడు. గత ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబుతో ఒక ఐటెం సాంగ్‌ కు గాను ఆడి పాడిన ఈ అమ్మడు మళ్లీ కమర్షియల్‌ యాడ్‌ కోసం కలిసింది. వీరిద్దరి కలయికలో షూట్‌ జరుపుకుంటున్న ఆ యాడ్‌ ఒకటి రెండు వారాల్లోనే బుల్లి తెర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ఆ బ్రాండ్ ఏంటీ అనేది ఆసక్తిగా ఉంది. త్వరలోనే ఆ విషయం కూడా రివీల్ అవ్వనుంది.

Exit mobile version