Advertisement

విజిల్స్ ఖాయం.. దర్శకుడి వ్యాఖ్యలు వైరల్

Posted : July 14, 2021 at 11:46 am IST by ManaTeluguMovies

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత కరోనా సెకండ్ వేవ్ రావడంతో సెకండ్ షెడ్యూల్ ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సర్కారు వారి పాట రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కీలక షెడ్యూల్ ను ఆగస్టు వరకు పూర్తి చేస్తారట. షూటింగ్ కు సెప్టెంబర్ వరకు గుమ్మడి కాయ కొట్టేయాలని దర్శకుడు పరశురామ్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇటీవల దర్శకుడు పరశురామ్ మీడియా ఇంట్రాక్షన్ లో సర్కారు వారి పాట సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్ బాబు అంటే తనకు చాలా అభిమానం. ఈ సినిమాను ఆయన అభిమానిగా చేస్తున్నట్లుగా చెప్పాడు. అభిమానులు మహేష్ ను ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో అలా నేను చూపించబోతున్నట్లుగా చెప్పిన దర్శకుడు సినిమాలోని కామెడీ కూడా సూపర్బ్ గా ఉంటుందని ఆయన అన్నాడు. మహేష్ బాబులోని కామెడీ యాంగిల్ ను ఈ సినిమాలో విభిన్నంగా చూపించడంతో పాటు రెగ్యులర్ కు భిన్నంగా కథనం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

కామెడీ సన్నివేశాలు ఇంకా విజిల్ మూమెంట్స్ సినిమాలో చాలా ఉంటాయని.. మహేష్ బాబు సగటు అభిమానికి సర్కారు వారి పాట సినిమా ఫుల్ మీల్స్ అన్నట్లుగా ఉంటుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుతున్న సన్నివేశాల విషయంలో పూర్తి సంతృప్తిగా ఉన్నట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు మెడపై రూపాయి కాయిన్ టాటూ నుండి మొదలుకుని ఎన్నో ప్రత్యేకతలు ఆయన లుక్ లో ఉంటాయని అంటున్నారు. పరశురామ్ వ్యాఖ్యలతో సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ను వచ్చే సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

షూటింగ్ ఆలస్యం అయినా కూడా సెప్టెంబర్ వరకు షూటింగ్ ను ముగించినట్లయితే సర్కారు వారి పాట ను సంక్రాంతికి తీసుకు రావడం పెద్ద సమస్య కాకపోవచ్చు అంటున్నారు. గత ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఆ సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ సినిమా తో కూడా మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా లో మహేష్ బాబు కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో కీలక పాత్రను యాక్షన్ కింగ్ అర్జున్ లేదా తమిళ స్టార్ నటుడు సముద్ర ఖని చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు చేయబోతున్న సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది. ఆ విషయమై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. త్రివిక్రమ్ తో ఖలేజా తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి మహేష్ బాబు సినిమా ల లైనప్ ఓ రేంజ్ లో ఉండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సర్కారు వారి పాట తో మొదలుకుని వరుసగా ఆయన సక్సెస్ లు సూపర్ హిట్ లు బ్లాక్ బస్టర్ లు దక్కించుకోవడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

CM Jagan Bus Yatra : Jagan రోడ్ షో ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న Vishaka YCP | Memantha Siddham

Posted : April 21, 2024 at 7:04 pm IST by ManaTeluguMovies

CM Jagan Bus Yatra : Jagan రోడ్ షో ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న Vishaka YCP | Memantha Siddham

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement