పశ్చిమబెంగాల్ లో పూర్తి ఆధిపత్యంను తృణముల్ కాంగ్రెస్ కనబర్చింది. మూడవ సారి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాన స్వీకారం చేయడం ఖాయం అంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల వారు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెబుతోంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ అధికారం దక్కించుకోవాలని ప్రయత్నించింది. కాని స్టాలిన్ ఆధ్యంలోని డీఎంకే పార్టీకి ప్రజలు పట్టం కట్టారు అంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. మొత్తంగా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి పెద్దగా ప్రయోజనం ఉన్నట్లుగా కనిపించడం లేదని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.