ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మమతా బెనర్జీకి గాయం..! కుట్ర కోణం ఉండొచ్చు.. దీదీ అనుమానం

పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ లో ప్రచారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీకి గాయమైంది. నందిగ్రామ్ లో ప్రచారంలో ఉండగా ఆమె కాలికి గాయమైంది. ప్రచారంలో భాగంగా తన కారు వద్ద ఉండగా ఎవరో కొందరు వ్యక్తులు కారు డోరోను బలంగా తోయడంతో గాయమైందని మమతా అన్నారు. దీని వెనుక కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమయంలో స్థానిక పోలీసులు అక్కడ లేకపోవడంపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు.

ఈ క్రమంలో ఆమె నందిగ్రామ్ చేరుకున్నారు. అనేక దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం హల్దియాలో నామినేషన్ వేశారు. ప్రచారం పూర్తైన తర్వాతా ఆమె ఈరోజు రాత్రికి నందిగ్రామ్ లోనే బస చేయాల్సి ఉంది. అయితే.. ఆమెకు గాయం కావడంతో పర్యటన అర్ధంతరంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి బెంగాల్ ఎన్నికలు. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. మమతకు పోటీగా బీజేపీ నుంచి సువేందు అధికారి పోటీ చేస్తున్నారు.

Exit mobile version