ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సీఎం కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలసిందే. దీంతో రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా స్పందించారు. ‘కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేద’ని అన్నారు. ఈమేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. కేసీఆర్‌ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

‘పోరాట యోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే ఆయన్ని కరోనా ఏమీ చేయలేదు. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను’ అని మోహన్‌బాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు.. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుగా ఆయన పర్సనల్‌ డాక్టర్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Exit mobile version