టీడీపీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఆయన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవలే బీజేపీలో జాయిన్ అయ్యాడు. తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మోత్కుపల్లి ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మోత్కుపల్లికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన హెల్త్ విషయమై ఆసుపత్రి వర్గాల వారు నేటి సాయంత్రం వరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.