ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ధోనీ ప్రొడక్షన్‌ నుండి రాబోతున్న ‘అఘోరి’

టీం ఇండియా మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోని ఆటలో ఉన్న సమయంలోనే ఎన్నో వ్యాపారాల్లో భాగస్వామి అయ్యాడు. ఆయన అంతర్జాతీయ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పిన తర్వాత ఆయన బిజినెస్‌ లో మరింత బిజీ అవ్వబోతున్నాడు. గతంలోనే ధోని ఒక మూవీ ప్రొడక్షన్‌ హౌస్‌ ను ప్రారంభించాడు. తన జీవిత చరిత్రను డాక్యుమెంటరీగా సొంత బ్యానర్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ తర్వత ధోని బ్యానర్‌ నుండి కొత్త ప్రాజెక్ట్‌ లు ఏమీ రాలేదు. ఎట్టకేలకు ధోని బ్యానర్‌ కొత్త ప్రాజెక్ట్‌ ను ఆయన భార్య సాక్షి ప్రకటించారు.

సైన్స్‌ ఫిక్షన్‌ మరియు పౌరాణిక కథ కలయికతో అఘోరి అనే కథను తీసుకుని వెబ్‌ సిరీస్‌ ను నిర్మిస్తున్నట్లుగా ఆమె ప్రకటించింది. దీనికి సినిమా తీయాలని అనుకున్నప్పటికి వెబ్‌ సిరీస్ గా అయితేనే ఈ కథకు పూర్తి న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు. ధోని ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ బ్యానర్‌ లో ఈ సినిమా రాబోతుంది.

పురాణాలపై మనకు ప్రస్తుతం ఉన్న నమ్మకాలను మార్చే విధంగా అఘోరి జర్నీ సాగుతుందని ఆ జర్నీతోనే కథ మొత్తం ఉంటుందని ఆమె అన్నారు. థ్రిల్లింగ్‌ అడ్వెంచర్‌ ఎలిమెంట్స్‌ తో ఈ వెబ్‌ సిరీస్‌ సాగుతుందని ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా థ్రిల్‌ చేస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో ఈ వెబ్‌ సిరీస్‌ పనులు పూర్తి చేస్తామన్నారు. ధోని బ్రాండ్‌ తో వస్తున్న వెబ్‌ సిరీస్‌ అవ్వడంతో ఖచ్చితంగా ప్రేక్షకులు అఘోరికి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.

Exit mobile version