సైన్స్ ఫిక్షన్ మరియు పౌరాణిక కథ కలయికతో అఘోరి అనే కథను తీసుకుని వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నట్లుగా ఆమె ప్రకటించింది. దీనికి సినిమా తీయాలని అనుకున్నప్పటికి వెబ్ సిరీస్ గా అయితేనే ఈ కథకు పూర్తి న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు. ధోని ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ లో ఈ సినిమా రాబోతుంది.
పురాణాలపై మనకు ప్రస్తుతం ఉన్న నమ్మకాలను మార్చే విధంగా అఘోరి జర్నీ సాగుతుందని ఆ జర్నీతోనే కథ మొత్తం ఉంటుందని ఆమె అన్నారు. థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో ఈ వెబ్ సిరీస్ సాగుతుందని ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా థ్రిల్ చేస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ పనులు పూర్తి చేస్తామన్నారు. ధోని బ్రాండ్ తో వస్తున్న వెబ్ సిరీస్ అవ్వడంతో ఖచ్చితంగా ప్రేక్షకులు అఘోరికి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.