ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ రీసెంట్ గా ప్రభాస్ తో సినిమా గురించి స్పందించాడు. ఈ సినిమా షూటింగ్ జులైలో మొదలవుతుందని అన్నాడు. తమ సినిమా కంటే ముందు ఆది పురుష్ రావడం తమకు కలిసొస్తుందని నాగ్ అశ్విన్ అభిప్రాయం. ఎందుకంటే ఆది పురుష్ అనేది రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు.
అందుకని ఈ చిత్రం నార్త్ ఇండియాలో రూరల్స్ ఏరియాస్ లోకి కూడా వెళ్తుంది. ప్రభాస్ మార్కెట్ కచ్చితంగా మరో 30 శాతం పెరుగుతుంది. ఈ పెరిగిన మార్కెట్ తమ సినిమాకు సహాయపడుతుందని నాగ్ అశ్విన్ అభిప్రాయం.