ఇక లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య థాంక్యూ చిత్రాన్ని చేస్తాడని అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. థాంక్యూ చిత్ర షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ రచయిత బివిఎస్ రవి ఈ చిత్రానికి కథను అందించాడు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికలుగా నటిస్తారని అంటున్నారు. థాంక్యూ గురించిన మరింత సమాచారం త్వరలో బయటకు రానుంది.