పలు కార్యక్రమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసారు రాజా. మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా నాగబాబుతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం రాజాకు కరోనా సోకగా దాన్నుండి కోలుకుంటున్నారు. అయితే సడెన్ గా ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన్ను కాపాడలేకపోయారు.
రాజా మరణ వార్త విని ఇండస్ట్రీలోని చాలా మంది తమ సంతాపాన్ని తెలియజేసారు. నటుడు కృష్ణుడు, వెంకట్ రాహుల్, దర్శకుడు విఎన్ ఆదిత్య తదితరులు రాజా ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.