‘ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజ్ పేయి.. వంటి మహనీయుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. స్వతంత్ర భారతం కల సాకారం కావడానికి కృషి చేసిన ఆ మహానుభావులను ప్రజలు మర్చిపోకూడదని ఒక ఆశ’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
ఇండియన్ కరెన్సీ నోట్లపై ఎప్పటినుంచో ఉండేది ఒక్క మహాత్ముడి ఫోటోనే. కరెన్సీ నోట్లు ఎన్న కొత్త రూపాల్లో వచ్చినా గాంధీ ఫొటోనే ముద్రిస్తున్నారు. దీనిపై ఎప్పుడూ ఎటువంటి చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు నాగబాబు చేసిన ట్వీట్ మాత్రం చర్చనీయాంశం అవుతోంది.దీనిపై రాజకీయంగా ఎటువంటి విమర్శలు వస్తాయో రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.