తాజాగా ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవికర్ ట్విట్టర్ లో నమ్రత ఫొటోలను షేర్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ లో అత్యంత అందంగా నమ్రతను ఆయన చూపించాడు. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఇష్టమైన వారిలో ఒకరు అంటూ ట్వీట్ పెట్టాడు. అలాగే నా ఇప్పటి వరకు కెరీర్ లో అత్యంత ఇష్టమైన ఫొటో షూట్ కూడా ఇదే అన్నట్లుగా కామెంట్ పెట్టాడు. మొత్తానికి ఈ ఫొటోలతో నమత్ర సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
మహేష్ బాబు అభిమానులు ఎంతో మంది ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. ఇక అవినాష్ గోవికర్ ట్వీట్ కు మహేష్ బాబు స్పందించడం ఇక్కడ ప్రత్యేకమైన విషయం. మహేష్ బాబు ట్వీట్ లో పిక్చర్ పర్ఫెక్ట్ అంటూ కామెంట్ పెట్టాడు. మహేష్ బాబు ట్వీట్ కు లక్షల మంది లైక్ చేయగా మరి కొందరు ఈ ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా నమ్రత పిక్ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంది.