లోకేష్ మాట్లాడుతూ.. 21 మంది లోక్ సభ ఆరుగురు రాజ్య సభ ఎంపీలు ఉండి వైకాపా ఏం సాధించింది. తెలుగు దేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు కూడా పార్లమెంటులో సింహాల మాదిరిగా పోరాడుతున్నారు. ఏపీకి సంబంధించిన పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లి సమస్యల పరిష్కారం కోసం సింహాల మాదిరిగా పోరాటం చేస్తున్నారు. వైకాపా అభ్యర్థి గెలిస్తే కేంద్రం నిర్ణయాలకు తలాడించే గొర్రెల మందలో మరో గొర్రె చేరినట్లు అవుతుంది. అలా కాదని టీడీపీ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మరో సింహం మాదిరిగా పోరాటం చేస్తారని లోకేష్ చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రిగా పని చేసిన పనబాక లక్ష్మి గారికి ఉన్న అనుభవం తో తిరుపతికి మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.