జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలయితే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు. గతంలో ఒకే సామాజికవర్గానికి చెందిన 37 మంది డీఎస్పీలకు ప్రమోషన్ల ఇచ్చామని తమపై రాష్ట్రపతికే అబద్దాలు చెప్పిన ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను అప్పట్లో తాము కొనుగోలు చేస్తే జగన్ అధికారంలోకి వచ్చేవారా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఆర్డీఏ చట్టాన్ని రైతులకు అనుకూలంగా చేయబట్టే సీఆర్డీఏ చట్టం గెలిచిందని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి.. రాజధాని ఒకటే ఉండాలనేది తమ విధానమని అన్నారు.