ఇందుకోసమే కొంత మంది నిర్మాతలు ఇష్టం లేకపోయినా ఓటిటి సంస్థలకు తమ సినిమాలను అమ్మేసుకుంటున్నారు. అగ్ర నిర్మాత సురేష్ బాబు వెంకటేష్ నటించిన రెండు చిత్రాలు దృశ్యం 2, నారప్పలను ఓటిటి సంస్థలకు అమ్మేశాడు.
దీనిపై వెంకటేష్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసారు. తమ అభిమాన హీరో సినిమా ఇలా థియేటర్లలో విడుదల కాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ సురేష్ బాబును తమ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసుకునే పరిస్థితి వచ్చే వరకూ వేచి చూడాలని కోరుతున్నారు.