మమత బెనర్జీ ముందుగానే తన ఓటమిని ఖరారు చేసుకుంది. అందుకే ఆమె ఈవీఎంలను అనుమానిస్తుంది ఇంకా ప్రజల నుండి సానుభూతి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మమత పదేళ్లుగా ఉత్తుత్తి హామీలకే పరిమితం అయ్యారు. ఈ పదేళ్ల కాలంలో బెంగాళీలు సాధించిన అభివృద్ది శూన్యం. అందుకే బీజేపీ ప్రభుత్వం రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని మోడీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం తుది దశకు వచ్చిన నేపథ్యంలో ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.