తమ పూర్వీకులు తప్పులు చేసి శిక్షలు పడకపోగా వారి వారసులుగా వచ్చిన వారు సైతం తమ పూర్వీకులు ఏం తప్పు చేసినా శిక్ష పడలేదు కనుక తాము తప్పులు చేస్తాం అన్నట్లుగా వారసులు ఉంటారు. కనుక దేశంకు వారసత్వ రాజకీయం వద్దని యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలంటూ మోడీ పిలుపునిచ్చారు. ఒకప్పుడు యువత అవినీతి రాజకీయాలను మార్చలేమని అనుకున్నారు. కాని కొత్త వారు రావడం వల్ల చాలా పెద్ద ఎత్తున అవినీతికి అడ్డు కట్ట పడిందని అన్నారు. వారసత్వంతో సంబంధం లేని యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే దేశం పురోగమిస్తుందని మోడీ పేర్కొన్నారు.