సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జాతిరత్నాలు సినిమాకు ఆయన తీసుకున్న పారితోషికం రూ.25 లక్షల రూపాయలుగా సమాచారం అందుతోంది. కాని ఇప్పుడు ఆయనతో సినిమాకు పలువురు నిర్మాతలు కోటి పారితోషికంతో సిద్దంగా ఉన్నారు. ఆయన డిమాండ్ చేయాలే కాని అంతకు మించి కూడా ఇస్తామంటున్నారు. ప్రముఖ నిర్మాతలు ఇప్పటికే ఆయనకు అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. మహేష్ బాబు నిర్మాణంలో ఒక సినిమాను నవీన్ పొలిశెట్టి చేసే అవకాశం ఉందంటున్నారు. కోటి రూపాయల పారితోషికంను నవీన్ కు మహేష్ ఇవ్వబోతున్నాడని కూడ ఆ చెబుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.