నయనతార-విఘ్నేష్ మరోసారి ఓనమ్ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పండగ కోసం చెన్నై నుంచి స్పెషల్ జెట్ విమానం కట్టించుకొని మరీ కొచ్చిలో ల్యాండ్ అయింది ఈ జంట. అట్నుంచి అటు నేరుగా నయనతార ఇంటికెళ్లారు. అప్పటికే సిద్దంగా ఉన్న సంప్రదాయ దుస్తులు ధరించి ఓనమ్ ను జరుపుకున్నారు.
వీళ్లిద్దరూ కలిసి ఇలా ఓనమ్ పండగ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. డేటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కలిసి ఇలా చాలా సార్లు వీళ్లు ఈ పండగ చేసుకున్నారు. దాదాపు ఐదేళ్ల కిందట వీళ్ల ఎఫైర్ బయటపడింది కూడా సరిగ్గా ఓనమ్ పండగ నాడే.