నిహారిక కోసం చిరంజీవి ఏకంగా రూ.1.5 కోట్ల విలువైన ఆభరణంను కానుకగా ఇచ్చాడట. అది మాత్రమే కాకుండా కాబోయే అల్లుడి కోసం కూడా ఖరీదైన బహుమానంను చిరంజీవి దంపతులు పెళ్లికి ముందే ఇచ్చేశారనే సమాచారం అందుతోంది. మొత్తానికి మెగా వేడుకకు అంతా సిద్దం అయ్యింది. చిరంజీవి దంపతులతో పాటు మొత్తం ఫ్యామిలీ కూడా ఉదయ్ పూర్ కు చేరుకోబోతున్నారు. ఇక నిహారిక దంపతులకు పవన్ నుండి అందబోతున్న కానుక ఏంటీ అనేది ఆసక్తిగా ఉంది. ఆయన పెళ్లికి హాజరు అవ్వడమే పెద్ద కానుకగా నిహారిక భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.