ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నాగబాబు అల్లుడు సెటిల్‌ చేసుకున్నాడు

నాగబాబు అల్లుడు జొన్నలగడ్డ చైతన్య షేక్‌ పేట్‌ అపార్ట్‌మెంట్‌ వ్యవహారంలో రాజీ కుదిరింది. తాను కమర్షియల్‌ అవసరాల కోసం తీసుకున్న అపార్ట్‌మెంట్‌ కు సంబంధించిన విషయంలో అక్కడి ప్రెసిడెంట్‌ ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గొడవకు దిగడంతో చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చైతన్య పై కూడా అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్‌ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు అంటూ వార్తలు వచ్చాయి. ఒకరిపై ఒకరు న్యూ సెన్స్‌ కేసును పెట్టుకున్నారు. చివరకు ఆ కేసు విషయంలో మద్యవర్తుల ద్వారా రాజీ కుదుర్చుకున్నారు.

నిహారిక దంపతులు ఆ అపార్ట్‌మెంట్ ను కమర్షియల్‌ ఉపయోగం కోసం తీసుకున్న విషయం మాకు తెలియదు అని ప్రెసిడెంట్ అంటే.. నిహారిక భర్త కూడా స్పందిస్తూ అపార్ట్‌మెంట్‌ ను ఈనెలలోనే ఖాళీ చేస్తామని.. పెట్టిన కేసును వెనక్కు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. మొత్తానికి చైతన్య మరియు షేక్ పేట్‌ అపార్ట్‌మెంట్‌ వారి మద్య నెలకొన్న వివాదం 24 గంటలు తిరగక ముందే సమసి పోయింది. చైతన్య స్వయంగా వీడియోను షేర్‌ చేసి తమ వివాదంను రాజీ కుదుర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆగస్టు 10 వరకు తాము అపార్ట్‌మెంట్‌ ను ఖాళీ చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు.

Exit mobile version