ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్

గతేడాది పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎస్తేర్, సింగర్ నోయల్ దంపతులు విడాకులు తీసుకున్నారు. తామిద్దరం విడాకులు తీసుకున్నామనే విషయాన్ని ఎస్తేర్, అఫీషియల్ గా వెల్లడించింది. ఈ సందర్భంగా కొన్ని ఆశ్చర్యకర విషయాల్ని బయటపెట్టింది ఈ హీరోయిన్.

గతేడాది జనవరి 3న ఎస్తేర్-నోయెల్ పెళ్లి చేసుకున్నారు. మంగుళూరులో గ్రాండ్ గా జరిగిన ఈ పెళ్లికి రాజమౌళి కూడా హాజరయ్యాడు. అలా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట కనీసం కొన్ని రోజులు కూడా కాపురం చేయలేదట. పెళ్లయిన మరుసటి రోజు నుంచే తామిద్దరి మధ్య సర్దుబాటు సమస్యలు తలెత్తాయని, అలా కొన్ని రోజులకే విడిపోయామని సంచలన ప్రకటన చేసింది ఎస్తేర్.

అలా పెళ్లయిన కొన్ని రోజులకే విడిపోయిన తామిద్దరం.. గతేడాది జూన్ లోనే మ్యూచువల్ డైవోర్స్ కు అప్లై చేశామని వెల్లడించింది. తామిద్దరం విడిపోయామనే విషయంపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కథనాలు వస్తున్నప్పటికీ.. అధికారికంగా వెల్లడించాలనే ఉద్దేశంతో తాను ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్నానని చెప్పుకొచ్చింది ఎస్తేర్.

నిన్న వీళ్లిద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈరోజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఎస్తేర్. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చకు తావిచ్చాయి. తను చాలా విషయాల్లో సూటిగా-నిజాయితీగా ఉంటానని.. కానీ ఈ విషయంలో మాత్రం ఇంతకంటే ఎక్కువ స్పందించలేనంటూ ప్రకటించింది ఎస్తేర్.

కొన్నాళ్లు ప్రేమించుకొని మరీ పెళ్లి చేసుకున్న ఈ జంట, వివాహ బంధంలోకి ఎంటరైన కొన్ని రోజులకే విడివిడిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది, పెళ్లయిన 5 నెలలకే ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందనేది మాత్రం వీళ్లకే తెలియాలి.

1000 అబద్ధాలు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఎస్తేర్. ఆ తర్వాత సునీల్ సరసన భీమవరం బుల్లోడు అనే సినిమా చేసింది. చాలా గ్యాప్ తర్వాత జయజానకి నాయక సినిమాలో మెరిసింది. ప్రస్తుతం ఈమె చేతిలో హిందీ, మరాఠి, తమిళ సినిమాలున్నాయి.

Exit mobile version