ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పీకే, తమిళ హీరో కాంబోపై క్లారిటీ

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత రెండేళ్లు గ్యాప్‌ తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఒకేసారి మూడు సినిమాలకు కమిట్‌ అయిన విషయం తెల్సిందే. అందులో మొదటిది బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘పింక్‌’ కు రీమేక్‌ గా రెండవది క్రిష్‌ దర్శకత్వంలో రూపొందబోతుంది. పింక్‌ రీమేక్‌ వకీల్‌ సాబ్‌ చిత్రం కంటే కూడా అందరికి కూడా క్రిష్‌ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విభిన్న చిత్రాల దర్శకుడిగా ఉన్న పేరు కారణంగా పవన్‌ ఫ్యాన్స్‌ చాలా నమ్మకం పెట్టుకున్నారు.

పవన్‌ 27వ చిత్రం కోసం దర్శకుడు క్రిష్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌తో చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో తమిళ స్టార్‌ నటుడు శివ కార్తికేయన్‌ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో తెలుగులో ఈయన ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో స్టార్‌ నటుడైన శివ కార్తికేయన్‌ ఈ చిత్రంలో నటిస్తే ఖచ్చితంగా తమిళనాట ఈ చిత్రంకు మంచి బజ్‌ క్రియేట్‌ అవ్వడం ఖాయం అనుకున్నారు.

గత కొన్ని రోజులుగా వస్తున్న ఈ వార్తలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అసలు పీకే 27 చిత్రం కోసం దర్శకుడు క్రిష్‌ ఇప్పటి వరకు కూడా శివ కార్తికేయన్‌తో చర్చలు జరపలేదట. సినిమా షూటింగ్‌ ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం లేకపోవడంతో కొత్త స్క్రిప్ట్‌ పనిలో క్రిష్‌ ఉన్నాడు తప్ప పీకే 27 చిత్రం వర్క్‌ లో లేడంటున్నారు. పీకే 27కు సంబంధించి స్క్రిప్ట్‌ పూర్తి అవ్వడంతో పాటు నటీనటుల ఎంపిక పూర్తి అయ్యిందట. కనుక శివ కార్తికేయన్‌ నటించే అవకాశమే లేదట.

Exit mobile version