ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తాడట. సాయి తేజ్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాడని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ ను ఉగాదికి లాంచ్ చేయాలన్నది ప్లాన్. కేవలం 20 రోజుల్లో పవన్ పోర్షన్స్ ను పూర్తి చేసేస్తారట.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్ వెనుక కూడా సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. జీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే అందుతాయి.