ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఉగాదికి లాంచ్ కానున్న పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ చిత్రం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్స్ చేయడానికే ఇష్టపడుతున్నాడు. భీమ్లా నాయక్ విజయం తర్వాత హరిహర వీర మల్లు షూటింగ్ చేస్తాడన్న వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు అది మరింత వెనక్కి జరిగే అవకాశాలు ఉన్నాయి. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన మరో చిత్రాన్ని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తాడట. సాయి తేజ్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాడని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ ను ఉగాదికి లాంచ్ చేయాలన్నది ప్లాన్. కేవలం 20 రోజుల్లో పవన్ పోర్షన్స్ ను పూర్తి చేసేస్తారట.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్ వెనుక కూడా సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. జీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే అందుతాయి.

Exit mobile version