ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మీ అందరి అభిమానంతో కరోనాను తన్ని తరిమేశాను: పూజా హెగ్డే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కరోనా నుంచి కోలుకుంది. ఈమేరకు ట్విట్టర్ లో తాను కోలుకున్నట్టు తెలిపింది. ‘నేను కరోనా నుంచి కోలుకున్నాను. నాకు కరోనా నెగటివ్ వచ్చింది. మీ అందరి ప్రేమాభిమానాలతో కరోనాను తన్ని తరిమేశాను. మీరంతా నాపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని ఆమె తెలిపింది. ఈమేరకు తన ఆనందాన్ని పంచుకుంది.

ప్రస్తుతం పూజా హేగ్డే చేతిలో భారీ సినిమాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్యలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. ప్రభాస్ తో రాధేశ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలజబుల్ బ్యాచిలర్, తమిళ హీరో విజయ్ తో ఓ సినిమా చేస్తోంది. పూజా కరోనా నుంచి కోలుకోవడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version