ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత బాలీవుడ్ లో మరో సినిమాను చేయాల్సి ఉంది. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ పాన్ ఇండియా సినిమాను చేయబోతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ కు భారీ మొత్తంలో దిల్ రాజు అడ్వాన్స్ ను కూడా ఇచ్చాడని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రెండేళ్ల తర్వాత వీరి కాంబోలో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్.. ఆదిపురుష్.. సలార్ మరియు నాగ్ అశ్విన్ ల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత దిల్ రాజు బ్యానర్ లో పాన్ ఇండియా మూవీని ప్రభాస్ చేయబోతున్నాడు. వచ్చే ఏడాదికి వీరి కాంబో దర్శకుడిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.