ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నాగేశ్వర్‌

2021 ఫిబ్రవరి మార్చిలో మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజక వర్గంకు జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రముఖ సామాజిక వేత్త.. వక్త నాగేశ్వర్‌ పోటీ చేయబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ విషయమై ఆయన తాజాగా అధికారికంగా క్లారిటీ ఇచ్చాడు.

తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. తన పేరును పలు సామాజిక సంస్థలు మరియు ప్రజా సంఘాలు ప్రతిపాధించిన కారణంగా తాను పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నట్లుగా పేర్కొన్నాడు.

ఇదే నియోజక వర్గం నుండి2007 మరియు 2009లో స్వతంత్ర్య అభ్యర్థిగా నాగేశ్వర్‌ పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2014 వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దం అయ్యారు. ఈ స్థానంపై టీఆర్‌ఎస్‌ పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉంది.

నాగేశ్వర్‌ బరిలోకి దిగబోతున్న నేపథ్యంలో మొత్తం సమీకరణాలు మారిపోయాయి. అసలు ఏం జరుగుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version