మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పుష్ప సినిమాను సుకుమార్ మొదలు పెట్టాడు. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమాను అనుకుంటున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదాని కంటే 50 శాతం అదనంగా అవుతుంది. దాంతో సినిమా రికవరీ ఎంత వరకు చేయగలుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేసి బ్రేక్ ఈవెన్ సాధించాలని సుకుమార్ భావిస్తున్నాడట. దానికి తోడు సినిమా కథ కూడా రెండు పార్ట్ లకు సరిపోయేంత ఉందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి.