అయితే రాశి ఖన్నా రూమర్స్ క్లియర్ చేసింది. తాను చేసిన ప్రతీ చిత్రం పట్ల తనకు గౌరవం ఉందని, ఇటువంటి అర్థరహితమైన వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది. నేను సౌత్ చిత్రాలను కించపరచలేదు అని రాశి ఖన్నా పోస్ట్ చేసింది.
తెలుగులో పక్కా కమర్షియల్ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తోంది రాశి. ఇటీవలే హిందీలో రుద్ర అనే వెబ్ సిరీస్ చేసింది. తమిళంలో కార్తీ సరసన సర్దార్, హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మరో సినిమా చేస్తోంది రాశి.