రాధే సినిమా ను ఇటీవలే జీ ప్లెక్స్ ద్వారా పే పర్ రిలీజ్ ద్వారా విడుదల చేశారు. వంద కోట్లకు పైగా మొదటి రోజే వసూళ్లు సాధించిన ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించింది. రాధేశ్యామ్ సినిమా ను కూడా జీ ప్లెక్స్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. థియేటర్ రిలీజ్ తో పాటు ఒకేసారి పే పర్ వ్యూ ద్వారా ఓటీటీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కాని ప్రభాస్ మాత్రం అందుకు ఒప్పుకుంటాడా అంటే అనుమానమే అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల వరకు పరిస్థితులు సర్దుమనిగితే పర్వాలేదు లేదంటే ఓటీటీ ద్వారా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.