కోవిడ్ సెంటర్ లో ఆ బెడ్స్ మరియు ఇతర అవసరాలకు సంబంధించిన పరికరాలను చిత్ర యూనిట్ సభ్యులు ఇవ్వడం జరిగిందట. కోవడ్ సెంటర్ కోసం ప్రభాస్ చిత్ర యూనిట్ సభ్యులు తమ వంతు సహకారం అందించడం అభినందనీయం. ఈ ఏడాది ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. పాట మినహా షూటింగ్ పూర్తి అయ్యింది. అందుకే ఆసుపత్రి సెట్టింగ్ ను తొలగించారని సమాచారం అందుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా యూవీ క్రియేషన్స్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇటలీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.