నన్ను మాధవ్ హెచ్చరించిన సమయంలో పక్కన కాంగ్రెస్ మరియు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారని.. వారికి కూడా ఆ పరిస్థితి అర్థం అయ్యింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ విజువల్స్ చూసినా కూడా నన్ను గోరంట్ల మాధవ్ హెచ్చరించిన విషయం అర్థం అవుతుందని రఘురామ చెప్పుకొచ్చాడు. పార్లమెంట్ హాల్ లో దూషణలతో వార్నింగ్ ఇవ్వడం పట్ల సీరియస్ గా రఘురామ వ్యవహరించబోతున్నాడట. ఆయన పై స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు కచ్చితంగా కఠినంగా ఆయన్ను శిక్షించేలా కార్యచరణ తో ముందుకు వెళ్తానంటూ చెప్పుకొచ్చాడు.