తాజాగా సీఎం సిమ్లా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్బంగా బొత్సా మాట్లాడుతూ అమరావతి అనేది 29 గ్రామాల రాజధాని మాత్రమే అంటూ వ్యాఖ్యలు చేశాడు. కొన్ని లక్షల మంది ఆకాంక్ష అయిన ఏపీ రాజధాని ని అవమానించినట్లుగా మాట్లాడటం ఏమాత్రం సబబు కాదు అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి లేని సమయంలో బొత్సా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడు అంటూ బొత్సా పై విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖ వాసికి ఏదైనా సమస్య ఉంటే కర్నూలుకు వెళ్లాలి అంటే ఎలా సాధ్యం అన్నట్లుగా విమర్శలు చేశాడు.