ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

జైల్లో జారిపడ్డ హీరోయిన్‌, బెయిల్‌ కోసం ప్రయత్నాలు

డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన కన్నడ హీరోయిన్‌ రాగిణి ద్వివేది ఇప్పటి వరకు నాలుగు అయిదు సార్లు కోర్టు ముందుకు బెయిల్ కోసం వెళ్లింది. కాని కేసు విచారణ జరుగుతున్న ఈ సమయంలో ఆమెను బయటకు పంపించడం అంటే కేసు నీరుగార్చడమే అవుతుంది అంటూ విచారణ అధికారుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమెకు బెయిల్‌ ను కోర్టు నిరాకరిస్తూ వచ్చింది.

బెయిల్‌ విషయంలో రాగిణి ద్వివేదితో పాటు మరో హీరోయిన్‌ సంజనా గర్లానీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా రాగిణి బెయిల్‌ కోసం మళ్లీ ప్రయత్నించింది. ఈసారి తన హెల్త్‌ విషయంను ఆమె సాకుగా చూపించింది.

జైలు బాత్‌ రూంలో తాను జారి పడ్డాను అని, జైలు ఆసుపత్రిలో తనకు సరైన చికిత్స అందడం లేదంటూ ఆమె కోర్టుకు తెలియజేసింది. తనకు బయట ఆసుపత్రిలో చికిత్స కోసం బెయిల్‌ ఇవ్వాలంటూ కోరింది. ఇదే సమయంలో తన కుటుంబ సభ్యులను కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. కోర్టు ఆమె పట్ల మానవతా దృక్పదంతో వ్యవహరిస్తుందా అనేది చూడాలి.

రాగిణి ద్వివేది వద్ద పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ లభించడంతో పాటు ఆమె విదేశాల్లో ఉన్న డ్రగ్స్‌ డీలర్లతో కూడా సంబంధాలు కలిగి ఉన్నట్లుగా నిరూపితం అయినట్లుగా ఎంక్వౌరీ ఆఫర్లు చెబుతున్నారు. ఈమెను మరో రెండు మూడు వారాలు విచారించిన తర్వాత అప్పుడు బెయిల్‌ పై వదిలే అవకాశం ఉందని కన్నడ మీడియా వర్గాల వారు అంటున్నారు.

Share

Exit mobile version