రాజ్ కుంద్రా ఆన్ లైన్ గేమ్ పేరుతో రూ.3 వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించాడు అంటూ ఆరోపించారు. ఆ సంపాదనకు శిల్పా శెట్టి సహకారం కూడా ఉందని పేర్కొన్నాడు. మూడు వేల కోట్ల రూపాయలను ఆన్ లైన్ గేమ్ తో సామాన్య జనాలను మోసం చేసిన రాజ్ కుంద్రా అందుకు గాను భార్య శిల్పా శెట్టిని వినియోగించుకున్నాడు. ఆమె కు ఉన్న స్టార్ డమ్ కారణంగా ఆమె ను బ్రాండ్ అంబాసిడర్ గా వినియోగించాడు. ఆమె అంబాసిడర్ అవ్వడం వల్ల ఆ గేమ్ ను జనాలు విపరీతంగా ఆడి మోసపోయారు అంటూ బీజేపీ నేత ఆరోపించాడు. ఈ విషయమై కూడా ఎంక్వౌరీ జరిగే అవకాశం ఉంది.