కోవిడ్ కారణంగా దాదాపు 6 నెలల పాటు షూటింగ్ ఆపేసిన ఈ చిత్ర టీం రీసెంట్ గా షూటింగ్ ని ప్రారంభించడమే కాక అక్టోబర్ 22న ఎన్.టి.ఆర్ టీజర్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కోవిడ్ వల్ల షూటింగ్ ఆగిపోయే టైంకి అలియా భట్ – రామ్ చరణ్ తో చేయనున్న పూణే షెడ్యూల్ కి అన్నీ సిద్ధం చేశారు. అప్పటికే అలియా భట్ డేట్స్ సమస్య వల్ల తన షెడ్యూల్స్ గతంలో రెండు సార్లు కాన్సల్ అయ్యాయి. తను డేట్స్ ఇచ్చేటప్పటికి కోవిడ్ రూపంలో మరో సమస్య వచ్చింది.
షూటింగ్ మొదలైనప్పటికీ అలియా భట్ డేట్స్ వలన మళ్ళీ షూటింగ్ ఆలస్యం అవుతుందేమో అనుకున్నారు. కానీ అలియా మాత్రం ఈ సారి ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ ఛాయస్ గా తీసుకున్నారు. అందుకే ఎన్.టి.ఆర్ టీజర్ కి సంబందించిన అన్ని షాట్స్, చరణ్ – తారక్ కాంబినేషన్స్ సీన్స్ ఈ నెలాఖరులోగా ఫినిష్ చేయనున్నారు. నవంబర్ నుంచి జరిగే షెడ్యూల్ లో అలియా భట్ జాయిన్ కానుంది. అలాగే తన షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకూ అలియా భట్ హైదరాబాద్ లోనే ఉండనుంది. దీని ప్రకారం ఈ సారి ఎవరి కారణంగా షూటింగ్ ఆగకుండా పగడ్బందీగా ప్లాన్ చేశారు. కావున వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కావడం పక్క అని ఈ చిత్ర టీం అంటోంది.