ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రాజమౌళి చర్య అనైతికం, బెదిరింపులోకే వస్తుంది!

ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ విషయంపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ పలు మార్లు జక్కన్నపై విరుచుకుపడ్డాడు. తాను నిర్మిస్తోన్న మైదాన్ అక్టోబర్ 15న విడుదల కానుంది. మేము ఎంతో ముందే విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో రాజమౌళి ఇలా తన సినిమాను పోటీకి ఉంచడం అనేది అనైతికమని ఇదివరకే చెప్పాడు బోని.

తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించాడు. ఇది విధ్వంసం కిందకే వస్తుందని, బెదిరింపు అని కూడా అనవచ్చని బోణీ అంటున్నాడు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా చాలా నష్టపోయాం. మేము విడుదల తేదీ ప్రకటించిన చాలా రోజుల తర్వాత ఆర్ఆర్ఆర్ విడుదలను ప్రకటించారు. రాజమౌళిని అడిగితే తనకు సంబంధం లేదని, ఇది నిర్మాత నిర్ణయమని అంటున్నాడు. కానీ అది నమ్మేలా లేదు.

మా హీరో అజయ్ దేవగన్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. అయినా కానీ తనకు కూడా రిలీజ్ డేట్ విషయంలో సంప్రదించకుండా రాజమౌళి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటో అర్ధం కావడం లేదు. ఇది వెన్నుపోటు చర్య. వందల మంది కెరీర్స్ తో ఆడుకుంటున్నాడు రాజమౌళి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు బోనీ కపూర్.

Exit mobile version